News May 26, 2024
నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది: మహేశ్ బాబు

కుమారుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వేడుకల ఫొటోలను షేర్ చేస్తూ తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘నీ తర్వాతి చాప్టర్ నువ్వే రాసుకోవాలి. నువ్వు మరింత వెలుగొందుతావని భావిస్తున్నా. నీ కలలను సాకారం చేసుకో. తండ్రిగా నేను ఈ రోజు గర్వపడుతున్నా’ అని గౌతమ్ను ఉద్దేశించి ప్రిన్స్ రాసుకొచ్చారు.
Similar News
News January 10, 2026
విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి కలిసిపోతాయి: సీఎం

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే 6 నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుందన్నారు. కొందరు అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి అసూయ చెందుతున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి.. అన్నీ కలిసిపోయి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా తయారవుతుందని ఓ కాలేజీ వార్షికోత్సవ సభలో వివరించారు.
News January 10, 2026
రేపే మ్యాచ్.. రిషభ్ పంత్కు గాయం!

రేపు న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి నడుము పైభాగంలో తాకినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. వెంటనే ఆయన మైదానాన్ని వీడగా సపోర్ట్ టీమ్ చికిత్స అందించినట్లు తెలిపాయి. అయితే గాయం తీవ్రత తెలియాల్సి ఉంది. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. గాయం తీవ్రత ఎక్కువైతే రేపు వడోదరలో జరిగే తొలి వన్డేలో పంత్ ఆడేది అనుమానమే.
News January 10, 2026
ఇరాన్ విప్లవం గురించి తెలుసా?

ఇరాన్ చివరి రాజు మహ్మద్ రెజా షా పహ్లావి 1941 నుంచి 1979 వరకు పాలించారు. ఆయిల్ నిల్వలను అమెరికా కంపెనీలకు కట్టబెట్టడం, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో మత పెద్దలు, ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అయతుల్లా రుహొల్లా ఖమేనీ నాయకత్వంలో(1979) ఇస్లామిక్ విప్లవంతో రెజా దేశం విడిచి పారిపోయారు. ఖమేనీ US కంపెనీలను బహిష్కరించారు. మహిళలపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఖమేనీల పాలనపై <<18808619>>వ్యతిరేకత<<>> మొదలైంది.


