News January 31, 2025
జగన్తోనే నా ప్రయాణం: ఆదిమూలపు సురేశ్

AP: తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. తన రాజకీయ ప్రయాణం జగన్తోనేనని ఆయన స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాగే తనపై దుష్ప్రచారం జరిగిందని మండిపడ్డారు. బతికున్నంతవరకు వైసీపీతోనే ఉంటానని తేల్చిచెప్పారు. కాగా కొద్దిరోజులుగా సురేశ్ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని వదంతులు చెలరేగిన విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2026
BIG BREAKING: భారత ఆర్మీ భారీ కోవర్ట్ ఆపరేషన్

మయన్మార్ భూభాగంలో భారత ఆర్మీ 2025 జులైలో చేసిన కోవర్ట్ ఆపరేషన్ను కేంద్రం తాజాగా ధ్రువీకరించింది. లెఫ్టినెంట్ కల్నల్ ఆదిత్య శ్రీకుమార్కు ప్రభుత్వం ఇవాళ శౌర్యచక్ర పురస్కారం అందించింది. ఈ సందర్భంగా విదేశీ భూభాగం నుంచి భారత వ్యతిరేక కుట్రలు చేస్తున్న కరుడుగట్టిన 9 మంది ఉగ్రవాదులను జులైలో మట్టుబెట్టే ఆపరేషన్ను ఆదిత్య ప్లాన్ చేసి, సేనను లీడ్ చేశారని కీర్తించింది. ఇలాంటి విషయాలను బయటకు చెప్పడం అరుదు.
News January 26, 2026
దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.
News January 26, 2026
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్!

గాయపడ్డ భారత క్రికెటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్తో ఐదో టీ20 సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సిరీస్లో ఆడే అవకాశం లేదని తెలిపాయి. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో WC వార్మప్ మ్యాచుకు జట్టులో చేరుతారని వెల్లడించాయి. కాగా వరల్డ్కప్ ముందు తిలక్ ఫిట్నెస్ సాధించడంతో భారత్కు ప్రయోజనం చేకూరనుంది. ఆయన చేరికతో జట్టు మరింత పటిష్ఠంగా మారనుంది.


