News January 31, 2025
జగన్తోనే నా ప్రయాణం: ఆదిమూలపు సురేశ్

AP: తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. తన రాజకీయ ప్రయాణం జగన్తోనేనని ఆయన స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాగే తనపై దుష్ప్రచారం జరిగిందని మండిపడ్డారు. బతికున్నంతవరకు వైసీపీతోనే ఉంటానని తేల్చిచెప్పారు. కాగా కొద్దిరోజులుగా సురేశ్ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని వదంతులు చెలరేగిన విషయం తెలిసిందే.
Similar News
News December 17, 2025
ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: CM

AP: గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని CM CBN కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు. వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి’ అని సూచించారు.
News December 17, 2025
ఐటీఐ అర్హతతో 156 పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<
News December 17, 2025
VIRAL: రష్మిక బ్యాచిలర్ పార్టీ?

విజయ్ దేవరకొండ, రష్మిక <<18465261>>2026లో పెళ్లి<<>> చేసుకోనున్నట్లు ప్రచారం సాగుతున్న సమయంలో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె తన గ్యాంగ్తో కలిసి శ్రీలంకకు వెళ్లిన ఫొటోలను SMలో షేర్ చేశారు. రష్మికతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, హీరోయిన్ వర్ష బొల్లమ్మ సహా మరికొందరు సన్నిహితులు ఈ ట్రిప్లో ఉన్నారు. కేవలం మహిళలతో ఉండటంతో ఇది పెళ్లికి ముందు ఇచ్చిన బ్యాచిలర్ పార్టీ కావచ్చని అభిమానులు అంటున్నారు.


