News July 5, 2024

నాకు ప్రాణహాని ఉంది.. భద్రత ఇవ్వండి: హైకోర్టులో అంబటి పిటిషన్

image

AP: ఇప్పటివరకు తనకున్న 4+4 గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. DGP, పల్నాడు SPకి వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. దీనికి కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.

Similar News

News March 27, 2026

బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు.. మోదీతో రేవంత్

image

TGలో పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ స‌ర‌ఫ‌రా, బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి CS ఆధ్వ‌ర్యంలో క‌మిటీని ఏర్పాటు చేసినట్లు PM మోదీ టెలికాన్ఫరెన్స్‌లో CM రేవంత్ తెలిపారు. ప్ర‌తి బంక్‌లో స్టాక్, విక్రయాలపై ఎప్ప‌టిక‌ప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించామని, 100% రోడ్డు ప‌న్ను, రిజిస్ట్రేష‌న్ ఫీజు మిన‌హాయించామ‌న్నారు. ఇకపై RTCలో ఈవీ బస్సులే వాడతామని PM దృష్టికి తీసుకెళ్లారు.

News March 27, 2026

సరిహద్దు రాష్ట్రాలు జాగ్రత్త: మోదీ

image

సరిహద్దు, కోస్టల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. షిప్పింగ్, నిత్యావసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాల విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సీఎంలతో వర్చువల్ మీటింగ్‌లో చెప్పారు. వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపారు. ఎరువుల స్టోరేజీ, సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని కోరారు.

News March 27, 2026

సరిహద్దు రాష్ట్రాలు జాగ్రత్త: మోదీ

image

సరిహద్దు, కోస్టల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. షిప్పింగ్, నిత్యావసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాల విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సీఎంలతో వర్చువల్ మీటింగ్‌లో చెప్పారు. వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపారు. ఎరువుల స్టోరేజీ, సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని కోరారు.