News July 5, 2024
నాకు ప్రాణహాని ఉంది.. భద్రత ఇవ్వండి: హైకోర్టులో అంబటి పిటిషన్

AP: ఇప్పటివరకు తనకున్న 4+4 గన్మెన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. DGP, పల్నాడు SPకి వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. దీనికి కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.
Similar News
News December 7, 2025
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ, అలాగే మరికొందరికి స్థానచలనం కల్పిస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పటమట ఎస్ఐ కృష్ణ వర్మ, తిరువూరు ఎస్ఐ సత్యనారాయణను 5వ ట్రాఫిక్కు భవానీపురంలో ఉన్న ఆనంద్ కుమార్ను సైబర్ క్రైమ్కు సుమన్ను పీసీఆర్కు కొత్తపేటలో ఉన్న రాజనరేంద్రను గుణదల పోలీస్ స్టేషన్కు నందిగామలో ఉన్న శాతకర్ణిను తిరువూరుకు బదిలీ చేశారు.
News December 7, 2025
ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
News December 7, 2025
20 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. HPV టెస్ట్, STD టెస్ట్, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు నెలసరిని వస్తుందా.. లేదా.. ఏవైనా హార్మోన్ సమస్యలున్నాయా అన్నవీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు హెల్తీ పుడ్, వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.


