News August 11, 2024
IND హెడ్ కోచ్గా నా లోయెస్ట్ పాయింట్ అదే: ద్రవిడ్

2021-22 టూర్లో సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ గెలవకపోవడమే తన కోచింగ్లో లోయెస్ట్ పాయింట్ అని టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ ద్రవిడ్ తెలిపారు. ‘మేము తొలి టెస్ట్ గెలిచాం. తర్వాత రెండు మ్యాచులు ఓడాం. కొంత మంది సీనియర్ ప్లేయర్లు లేరు. రోహిత్కు గాయమై దూరమయ్యాడు. మూడో టెస్ట్ గెలిచేవాళ్లం. కానీ SA బ్యాటర్లు బాగా ఆడి ఛేజ్ చేశారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది.
Similar News
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.


