News August 11, 2024
IND హెడ్ కోచ్గా నా లోయెస్ట్ పాయింట్ అదే: ద్రవిడ్

2021-22 టూర్లో సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ గెలవకపోవడమే తన కోచింగ్లో లోయెస్ట్ పాయింట్ అని టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ ద్రవిడ్ తెలిపారు. ‘మేము తొలి టెస్ట్ గెలిచాం. తర్వాత రెండు మ్యాచులు ఓడాం. కొంత మంది సీనియర్ ప్లేయర్లు లేరు. రోహిత్కు గాయమై దూరమయ్యాడు. మూడో టెస్ట్ గెలిచేవాళ్లం. కానీ SA బ్యాటర్లు బాగా ఆడి ఛేజ్ చేశారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది.
Similar News
News February 20, 2026
రూ.10 కోట్లు ఇవ్వు.. రణ్వీర్ సింగ్కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.
News February 20, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News February 20, 2026
పురుగు మందులను కొంటున్నారా?

పంటల్లో చీడపీడల నివారణకు పురుగు మందులను కొనేటప్పుడు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. ఒకే మందు పొడి మందుగాను, నీటిలో కరిగే ద్రావణంగాను, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను అనుసరించి నిపుణుల సూచనతో మందును కొనాలి. షాపు యజమాని నుంచి రసీదును తప్పక తీసుకోవాలి. కొనేమందు పురుగుల మందు డబ్బా గడువు తేదీని చూసి తీసుకోవాలి.


