News November 6, 2024
మిస్టీరియస్.. ఈ సరస్సు చుట్టూ అస్థిపంజరాలే!

భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి రూప్కుండ్ లేక్ (స్కెలిటెన్ లేక్). ఉత్తరాఖండ్లోని హిమాలయ శ్రేణుల్లో 16,740 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. దీని అంచున మానవ అస్థిపంజరాలు ఉండటంతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇవి 800CE-1800 CEకి చెందిన మానవ అవశేషాలుగా గుర్తించారు. ఈ మరణాలకు గల కచ్చితమైన కారణం ఇప్పటికీ కనుగొనలేకపోయారు. తుఫాను లేదా యుద్ధ సమయంలో వీరు చనిపోయి ఉండొచ్చని అంచనా.
Similar News
News November 19, 2025
ప్రెగ్నెన్సీలో అవకాడో తింటే..

అవకాడో గర్భిణులకు ఔషధ ఫలం అంటున్నారు నిపుణులు. ఇది సంతానోత్పత్తి, పిండం అభివృద్ధి, జనన ఫలితాలు, తల్లి పాల కూర్పును ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు శరీరం విటమిన్లను శోషించుకునేలా చేస్తాయి. అధిక పీచువల్ల ఆకలి తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఫోలిక్ ఆమ్లం గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ లోపాలు రాకుండా చూస్తుందని చెబుతున్నారు.
News November 19, 2025
చరిత్ర లిఖించిన అతిచిన్న దేశం.. FIFA వరల్డ్ కప్కు అర్హత!

కరీబియన్ దీవి దేశమైన కురాకో FIFA ప్రపంచ కప్కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం 1.56 లక్షల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ కప్కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశంగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఐస్లాండ్ పేరిట ఉన్న రికార్డును ఇది బద్దలు కొట్టింది. జమైకాతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్లో 0-0తో డ్రా చేసుకొని 2026 WCలో స్థానం సాధించింది. అర్హత సాధించడంతో ప్లేయర్లు ఎమోషనలయ్యారు.
News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71 సమాధానాలు

ప్రశ్న: గణేశుడు భారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
జవాబు: వినాయకుడు భారతం రాసేటప్పుడు ఈకలు ప్రతిసారి విరిగిపోయాయి. రచనను మధ్యలో ఆగిపోకూడదనే షరతుకు కట్టుబడిన గణేషుడు ఈకలతో పని కాదని గ్రహించి తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాయడం పూర్తిచేశాడు. మరో కథనం ప్రకారం.. పరశురాముణ్ని నిరోధించడంతో రెండు దంతాల్లో ఒక దాన్ని విరిచేస్తాడని చెబుతారు. <<-se>>#Ithihasaluquiz<<>>


