News January 20, 2025

మిస్టరీ జబ్బు: తలపట్టుకున్న ప్రభుత్వం!

image

JK రాజౌరీ (D) బాదాల్‌లో వేధిస్తున్న <<14924304>>వింత<<>> జబ్బుతో ప్రభుత్వం తలపట్టుకుంది. మహ్మద్ అస్లామ్ ఇంట ఆరో బిడ్డ చనిపోవడంతో మృతుల సంఖ్య మొత్తం 17కు చేరుకుంది. DEC 17 నుంచి ఈ మారణహోమం కొనసాగుతోంది. డిసెంబర్లో ఓ 2 కుటుంబాలు తద్దినం వంటిది ఏర్పాటు చేసి భోజనాలు చేశాయి. అప్పట్నుంచి వరుసగా పిల్లలు, పెద్దలు చనిపోతుండటంతో మొబైల్ లేబొరేటరీని పంపారు. ఇప్పుడు HM అమిత్ షా కేంద్ర, రాష్ట్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు.

Similar News

News November 26, 2025

RRR కేసు.. సునీల్ కుమార్‌కు సిట్ నోటీసులు

image

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్‌తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.

News November 26, 2025

నేర నిరూపణకు నల్లుల సాయం

image

నేర పరిశోధనలో నల్లులు కీలకంగా మారే అవకాశం ఉందని మలేషియా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నల్లులు మనుషుల రక్తాన్ని పీల్చిన తర్వాత అందులోని DNAను సుమారు 45 రోజుల వరకు నిల్వ ఉంచగలవని సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా బృందం తెలిపింది. నేరం జరిగిన ప్రాంతాల్లో నల్లులు ఉంటే వీటి నుంచి సమాచారం గుర్తించవచ్చని, సాక్ష్యాలు లేకుండా చేసిన కేసుల్లోనూ ఇవి కీలక ఆధారాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

News November 26, 2025

‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్‌.. స్పందించిన హీరోయిన్

image

తాను నటించిన ‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి ఆండ్రియా జెరేమియా స్పందించారు. సినిమాలో బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైరెక్టర్ అడిగితే పాత్ర కోసం ఏదైనా చేస్తానని ఆమె చెప్పారు. ఆండ్రియా పిశాచి, సైంధవ్, తడాఖా వంటి సినిమాల్లో నటించారు. పిశాచి-2 విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్‌లో తెరకెక్కింది. కోర్టు కేసు కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.