News June 24, 2024
రాజ్యసభ పక్ష నేతగా నడ్డా

రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా నియమితులయ్యారు. పీయూష్ గోయల్ స్థానంలో ఆయనను నియమించారు. నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానే కాకుండా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మరోవైపు పీయూష్ గోయల్ కేంద్రమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News December 4, 2025
స్పోర్ట్స్ రౌండప్

➤ నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు(డేఅండ్నైట్).. బ్రిస్బేన్ వేదికగా మ్యాచ్
➤ ది హండ్రెడ్ లీగ్లో రిలయన్స్ ఎంట్రీ. ఓవెల్ ఇన్విసిబుల్ జట్టులో 49% వాటా కొనుగోలు. టీమ్ పేరు MI లండన్గా మార్పు
➤ నేడు అజిత్ అగార్కర్ బర్త్ డే.. ఆయన పేరు మీదే భారత్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(21 బాల్స్)
➤ ICC వన్డే ర్యాంకింగ్స్లో 5 నుంచి నాలుగో స్థానానికి చేరిన కోహ్లీ.. టాప్ ర్యాంక్లో కొనసాగుతున్న రోహిత్
News December 4, 2025
నేడు, రేపు భారత్లో పుతిన్ పర్యటన

రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండ్రోజుల పర్యటనకు నేడు భారత్ రానున్నారు. రాత్రి 7గంటలకు ఢిల్లీ చేరుకొని PM మోదీ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత మోదీ-పుతిన్ మధ్య భేటీ జరగనుంది. పుతిన్ కోసం NSG కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, AIతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. 2021 తర్వాత మళ్లీ ఆయన భారత్కు రావడం ఇదే.
News December 4, 2025
నేడు భారీ వర్షాలు: APSDMA

AP: నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం 5PM వరకు తిరుపతి(D) తొట్టంబేడులో అత్యధికంగా 47.2మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది.


