News October 29, 2024

హెజ్బొల్లా చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్

image

ఇరాన్ మద్దతు గల లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ ఎంపికయ్యారు. హసన్ నస్రల్లా మృతి చెందడంతో ఆయన స్థానంలో నయీమ్‌ను నియమించారు. నయీమ్ ఇప్పటివరకు హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్‌గా కొనసాగారు. నస్రల్లాతో కలిసి ఆయన యాక్టివ్‌గా పనిచేశారు. నయీమ్ 1953లో దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలాలో జన్మించారు. తొలుత ఆయన కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశారు. 1982లో హెజ్బొల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

Similar News

News November 16, 2025

ఆ ఐదేళ్లు రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్: చంద్రబాబు

image

AP: 2019-24 కాలం రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. సోలార్ రంగం అభివృద్ధి చెందకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎకో సిస్టమ్ నిర్మించే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ కారణంతోనే రాష్ట్రానికి గూగుల్ వచ్చిందని పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు తయారు చేస్తున్నామని చెప్పారు.

News November 16, 2025

వారణాసి: ఒకేసారి ఇన్ని సర్‌ప్రైజులా?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘<<18299698>>వారణాసి<<>>’ నుంచి వరుస అప్డేట్స్ వచ్చాయి. globe trotter ఈవెంట్‌లో మూవీ టైటిల్, మహేశ్ ఫస్ట్ లుక్‌, 3.40 నిమిషాల గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. 2027 సమ్మర్‌లో మూవీ విడుదల అని కీరవాణి తెలిపారు. రామాయ‌ణంలో ముఖ్య‌మైన <<18299599>>ఘ‌ట్టం <<>>తీస్తున్నాన‌ని, మహేశ్‌కు రాముడి వేషం వేశానని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఒకేసారి ఇన్ని సర్‌ప్రైజులు ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News November 16, 2025

జాతీయవాదం వల్లే యుద్ధాలు: మోహన్ భాగవత్

image

ప్రపంచ సమస్యలకు సమాధానాలు అందించే తెలివి, ఆలోచన ఇండియాకు ఉన్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘జాతీయవాదం కారణంగానే యుద్ధాలు జరుగుతాయి. అందుకే ప్రపంచ నేతలు అంతర్జాతీయవాదం గురించి మాట్లాడటం ప్రారంభించారు. కానీ తమ దేశ ప్రయోజనాలనే ప్రధానంగా చూసుకుంటారు’ అని చెప్పారు. జైపూర్‌లో నిర్వహించిన దీన్ దయాళ్ స్మృతి ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు.