News October 29, 2024
హెజ్బొల్లా చీఫ్గా నయీమ్ ఖాస్సేమ్

ఇరాన్ మద్దతు గల లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా చీఫ్గా నయీమ్ ఖాస్సేమ్ ఎంపికయ్యారు. హసన్ నస్రల్లా మృతి చెందడంతో ఆయన స్థానంలో నయీమ్ను నియమించారు. నయీమ్ ఇప్పటివరకు హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్గా కొనసాగారు. నస్రల్లాతో కలిసి ఆయన యాక్టివ్గా పనిచేశారు. నయీమ్ 1953లో దక్షిణ లెబనాన్లోని క్ఫర్ ఫిలాలో జన్మించారు. తొలుత ఆయన కెమిస్ట్రీ టీచర్గా పనిచేశారు. 1982లో హెజ్బొల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.
Similar News
News October 25, 2025
ఊహించడానికే భయంకరంగా ఉంది: రష్మిక

కర్నూలు <<18088805>>బస్సు<<>> ప్రమాద ఘటనపై రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘అగ్ని ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. మంటలలో చిక్కుకున్న ప్రయాణికుల బాధ ఊహించడానికే భయంకరంగా ఉంది. చిన్నపిల్లలు, మొత్తం కుటుంబం, చాలా మంది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని Xలో పేర్కొన్నారు.
News October 25, 2025
ఆ తల్లి కన్నీటి మంటలను ఆర్పేదెవరు?

కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదం<<>> ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. బాపట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గన్నమనేని ధాత్రి (27) మృతితో తల్లి వాణి ఒంటరైపోయారు. 2 ఏళ్ల కిందట అనారోగ్యంతో భర్త, ఇప్పుడు బిడ్డను పోగొట్టుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. నెల్లూరుకు చెందిన అనూష తన బిడ్డ మన్వితను కాపాడుకోవాలని తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో కుమార్తెను గుండెలకు హత్తుకుని కాలిపోయిన దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది.
News October 25, 2025
టోల్ప్లాజాల వద్ద పాస్ల వివరాలతో బోర్డులు: NHAI

వాహనదారుల్లో అవగాహన, పారదర్శకత కోసం NHAI కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద నెలవారీ, వార్షిక పాస్ల వివరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. 30 రోజుల్లోపు పాస్ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పింది. ఈ మేరకు ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఇతర ప్రాంతాల్లో ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషల్లో వివరాలను ప్రదర్శించనున్నారు.


