News May 18, 2024
ట్వీట్ డిలీట్ చేసిన నాగబాబు.. నెటిజన్ల సెటైర్లు

ఇటీవల నాగబాబు చేసిన <<13269030>>ట్వీట్<<>> మెగా ఫ్యాన్స్-అల్లు ఆర్మీ మధ్య చిచ్చుపెట్టింది. ఈ క్రమంలో తొలుత అకౌంట్ను డీయాక్టివేట్ చేసిన ఆయన.. ఇవాళ ఆ ట్వీట్ను తొలగించారు. దీంతో అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అల్లు అర్జున్ తన ఫ్రెండ్స్కు సపోర్ట్ చేస్తే తప్పేంటని ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి తన తమ్ముడు పవన్తోపాటు బీజేపీ నేతలకూ సపోర్ట్ చేశారని గుర్తు చేస్తున్నారు.
Similar News
News January 10, 2026
కాలుష్యంలో ఢిల్లీని దాటేసిన బర్నీహాట్

దేశంలో కాలుష్యానికి రాజధాని ఢిల్లీనే అనుకుంటే ఈసారి అస్సాంలోని బర్నీహాట్ పట్టణం అంతకు మించిపోయింది. ఢిల్లీని వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. సీఆర్ఈఏ (Centre for Research on Energy and Clean Air) తాజా నివేదిక ప్రకారం పీఎం2.5, పీఎం10 స్థాయులు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 44% నగరాలు వాయు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. UPలో అత్యధికంగా 416 నగరాలు ఈ జాబితాలో నిలిచాయి.
News January 10, 2026
బొంత ఊద.. వరి లాంటి కలుపు మొక్క

వరి చేనులో బొంత ఊద కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.
News January 10, 2026
హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్షిప్

<


