News August 29, 2024
నాగార్జున స్టైలిష్ లుక్

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాగ్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. అందులో నాగ్ స్టైలిష్గా కనిపించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆయన ‘సైమన్’ అనే పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Similar News
News January 28, 2026
మేడారం జాతర.. ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు

TG: మేడారం జాతర సందర్భంగా ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీనికి బదులు ఫిబ్రవరి 14 (రెండో శనివారం) పనిదినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
News January 28, 2026
హైదరాబాద్ సీసీఎంబీలో 80 పోస్టులు

HYDలోని CSIR-CCMB 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ/NTC/STC, డిప్లొమా, BE/BTech, BSc/MSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెక్నీషియన్కు నెలకు రూ.39,545, tech. assist.కు రూ.72,240, tech. ఆఫీసర్కు రూ.90,100 చెల్లిస్తారు. వెబ్సైట్: www.ccmb.res.in/
News January 28, 2026
‘రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం’.. పవార్ మృతిపై రాజ్ ఠాక్రే

అజిత్ పవార్ మృతిపై MNS చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన కామెంట్లు చేశారు. రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇది తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. ‘అజిత్ ముక్కుసూటిగా ఉంటారు. హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన శైలి కాదు. దీని వల్ల తను ఎంత మూల్యం చెల్లించుకున్నారో ఊహించుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. అటు <<18982388>>విమాన ప్రమాదంపై<<>> మమతాబెనర్జీ అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే.


