News January 3, 2025
ఈ నెల 28 నుంచి నాగోబా జాతర

TG: రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగే కెస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఆలయంలో 150మంది ఆదివాసీ యువత రక్తదానం చేసి జాతరకు అంకురార్పణ చేశారు. నాగోబా జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా గిరిజనులు తరలిరానున్నారు.
Similar News
News January 23, 2026
పాపం ఆ చిన్నారి.. బిక్కుబిక్కుమంటూ చూస్తూ..

అమెరికాలోని మిన్నెసోటాలో అక్రమ వలసలపై ICE అధికారులు <<18880489>>ఉక్కుపాదం<<>> మోపుతున్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారి లియామ్ రామోస్ను డిటెన్షన్ సెంటర్కు తరలించారు. దీంతో చిన్నారి ఏడుస్తూ, బిక్కుబిక్కుమంటూ చూస్తుండిపోయాడు. ప్రీస్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా అధికారులు తీసుకెళ్లడంపై తీవ్ర దుమారం రేగుతోంది. రామోస్ చిన్న పిల్లాడని, ఆ పసికందును ఎరలా వాడుకోవద్దని మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మండిపడ్డారు.
News January 23, 2026
350 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBA, PGDBM, PGDM, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్తో పాటు పని అనుభవం గలవారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-30ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు). రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 23, 2026
నేడు శ్రీవారి పలు దర్శన టోకెన్లు విడుదల

AP: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి సంబంధించి పలు సేవల టోకెన్లు ఇవాళ రిలీజ్ కానున్నాయి. శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా ఉదయం 10గంటలకు TTD విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక శ్రీవారి దర్శన టోకెన్లు 3pmకు విడుదల చేయనున్నారు. అటు అధికారిక వెబ్సైట్ను ఫాలో కావాలని, దళారులను నమ్మొద్దని TTD హెచ్చరిస్తోంది.


