News June 19, 2024
భరతఖండంలో ‘నలంద’ ఎంతో ప్రత్యేకం
427లో ఏర్పాటైన పురాతన నలంద యూనివర్సిటీ బౌద్ధం, గణితం, వైద్యం, రాజకీయం, ఖగోళశాస్త్రం, యుద్ధ విద్య రంగాల్లో ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్దంలో నలందలో ఆచార్య ఆర్యభట్ట నేతృత్వంలో గరిష్ఠంగా 10వేల మంది విద్యార్థులు, 2వేల మంది టీచర్లు ఉండేవారు. 1193లో భక్తియార్ ఖిల్జీ సైన్యం ఈ యూనివర్సిటీని ధ్వంసం చేసింది. 90 లక్షలకుపైగా గ్రంథాలున్న లైబ్రరీకి వారు నిప్పుపెట్టగా ఆ మంటలు చల్లారడానికి 3 నెలలు పట్టిందట.
Similar News
News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి
గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
News February 3, 2025
ప్రభాస్ ‘కన్నప్ప’ లుక్పై ట్రోల్స్
కన్పప్పలో ప్రభాస్ లుక్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ లుక్ ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో నాగార్జున లుక్ను పోలి ఉందని పలువురు పోస్టులు చేస్తున్నారు. విగ్ సెట్ అవలేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా లుక్పై ఫోకస్ చేయాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ లుక్పై మీ కామెంట్?
News February 3, 2025
పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు: రోజా
AP: కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘కూటమి నేతల అరాచకాల్ని ఖండిస్తున్నాం. తిరుపతిలో మేయర్ ఎన్నిక సందర్భంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. మీరు నిజంగా ప్రజా మద్దతుతో గెలిచి ఉంటే ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.