News March 17, 2024
నల్గొండ: రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా..?

లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు మోడల్ కోడ్ అమలుతో పలు చర్యలు చేపట్టారు. అంతరాష్ట్ర సరిహద్దులు తగిన చెక్పోస్టుల ఏర్పాటు చేశారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వెల్లడించారు. లేనిపక్షంలో నగదును సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
Similar News
News November 25, 2025
మహిళల ఆర్థికాభివృద్ధికి క్రమశిక్షణే ముఖ్యం: ఇలా త్రిపాఠి

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా, ధైర్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఈ రోజు నల్గొండలో 22,997 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.26.34 కోట్ల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా సంఘాలు జాతీయస్థాయి అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
News November 25, 2025
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇలా త్రిపాఠి

మహిళలు చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మహిళల కోసం మహిళలే అండగా నిలబడాలని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని ఇస్తుందన్నారు. మహిళలు శక్తిగా ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
News November 25, 2025
నల్గొండ: ఆకట్టుకున్న ఇందిరమ్మ గృహప్రవేశం

మాడ్గులపల్లి మండలం పోరెడ్డిగూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలంతా ఇందిరమ్మ చీరలు కట్టుకున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్తో కలిసి వారు ఫొటో దిగగా ఆకట్టుకుంటోంది.


