News March 17, 2024

నల్గొండ: పట్టభద్రుల ఓటర్లు 5,06,527 మంది

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ఈనెల 14వ తేదీతో ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో 5,06,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నల్గొండ – 87,596, సూర్యాపేట – 55,837, యాదాద్రి భువనగిరి – 39,066 మంది ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News February 11, 2026

నల్గొండ: ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్: కలెక్టర్

image

కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను తనిఖీ చేస్తున్నారు. పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల, బోయవాడలోని మోడల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే 18004251442 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

News February 11, 2026

నల్గొండ: ఇవాళ సెలవు

image

నల్గొండతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల పరిధిలోని అన్ని బ్యాంకులకు బుధవారం సెలవు ప్రకటించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ తెలిపారు. గురువారం యథా విధిగా బ్యాంకులు పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఫిబ్రవరి 11న ప్రత్యేక సాధారణ సెలవు దినాన్ని వినియోగించుకుని తమ ఓటు వేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు.

News February 11, 2026

నల్గొండలో మరి కాసేపట్లో పోలింగ్‌

image

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, చండూరు,హాలియా, దేవరకొండ, నందికొండ,చిట్యాల పురపాలికల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 162 వార్డుల పరిధిలో 475 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 3,09,097 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.