News March 17, 2024
నల్గొండ: పట్టభద్రుల ఓటర్లు 5,06,527 మంది

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ఈనెల 14వ తేదీతో ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో 5,06,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నల్గొండ – 87,596, సూర్యాపేట – 55,837, యాదాద్రి భువనగిరి – 39,066 మంది ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.
Similar News
News April 8, 2026
NLG: రాజధానిలో యాక్సిడెంట్.. జిల్లా యువకులు మృతి

HYD వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హాలియా (M) అల్వాల వాసి శివ (20), మిర్యాలగూడ వాసి సందీప్(20) మృతి చెందారు. మంగళవారం రాత్రి వీరు రోడ్డు పక్కన ఆగి ఉండగా.. మద్యం మత్తులో ఉన్న రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కారుతో బలంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 8, 2026
NLG: దశాబ్దాల కల.. నత్తనడకన పనులు!

జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే అభివృద్ధి పనులు ఇంకా ప్రతిపాదనలు, పునాదుల స్థాయిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా NLG నుంచి మాచర్ల వరకు వేయాల్సిన కొత్త రైల్వే లైన్ వ్యవహారం ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదు. NLGను పల్నాడు ప్రాంతంతో కలిపే సుమారు 90 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ పూర్తయితే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. కానీ, భూసేకరణలో జాప్యం, నిధుల కొరత ఈ ప్రాజెక్టుకు శాపంగా మారాయి.
News April 8, 2026
NLG: ఏడేళ్లుగా అదే పారితోషికమా?

సర్కార్ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది పదో తరగతి పేపర్ల దిద్దుబాటు చేసినా, దానికి సంబంధించిన రెమ్యూనరేషన్ ఇప్పటికీ అందకపోవడంపై నల్గొండకు చెందిన ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు కులగణన విధుల్లో పాల్గొన్న వారికీ పైసలు ఇవ్వలేదు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ రేట్లు పెంచిన సర్కారు, మరి టెన్త్ క్లాస్ వారికి ఎందుకు పెంచడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.


