News March 17, 2024

నల్గొండ: పట్టభద్రుల ఓటర్లు 5,06,527 మంది

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ఈనెల 14వ తేదీతో ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో 5,06,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నల్గొండ – 87,596, సూర్యాపేట – 55,837, యాదాద్రి భువనగిరి – 39,066 మంది ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News April 11, 2025

నల్గొండ జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ 

image

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెలరోజుల పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30, 30ఎ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 10, 2025

ప్రణాళిక అంచనాలు రూపొందించాలి: కలెక్టర్ ఇలా

image

గిరిజన తండాలు, వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ ప్రణాళికతో పాటు, అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. దర్తి ఆబా యోజన పథకం కింద కల్పించే మౌలిక వసతుల విషయమై గురువారం ఆమె నందికొండ మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

News April 10, 2025

నల్గొండ: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11,15,16 తేదీలలో జరుగబోయే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.

error: Content is protected !!