News March 18, 2024
నల్లగొండ: విద్యార్థులు ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి

నేటి నుండి ప్రారంభమవుతున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సు ప్రయాణం సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ ఎస్. శ్రీదేవి తెలిపారు. వ్యాలిడిటీ కలిగిన బస్సు పాస్ ఉండి రూట్ తో సంబంధం లేకుండా హాల్ టికెట్ పై ఉన్న పరీక్ష కేంద్రానికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, కాంబినేషన్ టికెటుతో ఎక్ ప్రెస్ బస్సులోనూ ప్రయాణం చేయవచ్చని తెలిపారు.
Similar News
News December 14, 2025
త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

బృందావనపురం సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.
News December 14, 2025
నల్గొండ జిల్లాలో తొలి ఫలితం

నిడమనూరు మండలం వెంగన్నగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సలాది నాగమణి నాగరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన కొండారి నాగజ్యోతి చంద్రశేఖర్ మీద 87 ఓట్ల తేడాతో వారు విజయం సాధించారు. తమ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడతామని నాగమణి తెలిపారు.
News December 14, 2025
నల్గొండ: బీసీల ఖాతాల్లోకి 49 శాతం సర్పంచ్ స్థానాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు ఆధిపత్యం చూపారు. మొత్తం 630 సర్పంచ్ స్థానాల్లో 308 చోట్ల బీసీలు గెలుపొందారు. వీటిలో 140 బీసీ రిజర్వ్ స్థానాలు కాగా, జనరల్ కేటగిరీలోనూ 158 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. ఎస్సీలు 138, ఎస్టీలు 91, ఓసీలు 93 స్థానాల్లో గెలిచారు. బీసీలకు 49 శాతం సర్పంచ్ స్థానాలు దక్కాయి.


