News February 10, 2025
విజయవాడ వెస్ట్ బైపాస్కు రంగా పేరు పెట్టండి: షర్మిల

AP:విజయవాడ వెస్ట్ బైపాస్కు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని CM చంద్రబాబును APCC చీఫ్ షర్మిల కోరారు. ‘కాజా టోల్ గేట్ నుంచి చిన్న అవుటుపల్లి వరకు 47.8KM దూరం గల బైపాస్ పూర్తి కావొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ బైపాస్తో ట్రాఫిక్ కష్టాలు కొంత తగ్గుతాయి. ప్రజలకు రంగా చేసిన సేవ అనిర్వచనీయం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించి, పేదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన రంగా పేరు పెట్టండి’ అని ఆమె లేఖ రాశారు.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


