News March 21, 2025

నంది అవార్డులను పునరుద్ధరించాలి: నిర్మాతల మండలి

image

APలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని నిర్మాతల మండలి తెలిపింది. విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో స్టూడియోలు నిర్మించాలని, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరామంది. నంది అవార్డులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రులు లోకేశ్, దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Similar News

News November 22, 2025

TU: పీజీ ఇంటిగ్రేటెడ్ రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోండి..!

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఇంటిగ్రేటెడ్( అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్) 2,4 సెమిస్టర్ల రెగ్యులర్ విద్యార్థులు తమ ఫలితాలపై రివాల్యుయేషన్ చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ తెలిపారు. ఈ మేరకు నిన్న సర్కులర్ జారీ చేశారు. ఈనెల 29లోపు రూ.500 రుసుము చెల్లించి పరీక్షల విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.