News August 30, 2025
ఈ ఏడాది చివర్లో నంది అవార్డులు: మంత్రి దుర్గేశ్

AP: తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో నంది అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. విశాఖలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. గిడుగు రామమూర్తి, గురజాడ, కందుకూరి కృషి ఫలితంగానే తెలుగు భాషకు మహోన్నత స్థానం లభించిందని చెప్పారు. ఈ క్రమంలో రామమూర్తి అవార్డు గ్రహీతలను సత్కరించి, అవార్డులు, నగదు అందజేశారు.
Similar News
News February 13, 2026
పాకిస్థాన్తో మ్యాచ్.. అభిషేక్ ఆడే ఛాన్సుందన్న వరుణ్

T20 WC: పాకిస్థాన్తో మ్యాచ్ ఆడేందుకు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిన్న మ్యాచ్ అనంతరం చెప్పారు. అభి బాగానే కనిపించాడని, ప్రాక్టీస్ కూడా చేశాడని తెలిపారు. మరోవైపు అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచులకు అందుబాటులో <<19122478>>ఉండకపోవచ్చని<<>> నిన్న మ్యాచుకు ముందు కెప్టెన్ సూర్య పేర్కొన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. కాగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ తలపడనున్నాయి.
News February 13, 2026
ఫుట్వేర్ కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

పాదాల రక్షణకు ఫుట్వేర్ అవసరం. అయితే చెప్పులు కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు . మీ సైజ్కు సరిపోయే చెప్పులే కొనాలి. టైట్/ లూజ్గా ఉంటే నడవడానికి ఇబ్బందవుతుంది. ఫుట్వేర్ స్టైల్తో పాటు ధరకి సరిపడా క్వాలిటీ ఉందో..లేదో చూసుకోవాలి. మీ అవసరాన్ని బట్టి రెగ్యులర్ వేర్, ఫంక్షనల్ వేర్, ఆఫీస్ ఫుట్వేర్ ఎంచుకోవాలి. వైట్, బ్లాక్, క్రీమ్ కలర్ ఫుట్ వేర్ ఏ డ్రెస్కైనా మ్యాచ్ అవుతాయి.
News February 13, 2026
బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

బంగ్లాదేశ్లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.


