News October 11, 2024
నందిగం సురేశ్కు అస్వస్థత
AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 11, 2024
ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ ఇదే: ఏకంగా కి.మీపైనే!
సౌదీలోని జెడ్డాలో ‘జెడ్డా ఎకనమిక్ టవర్స్’ పేరుతో 1,007 మీటర్ల ఎత్తైన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో 157 అంతస్తులు, 59 లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ అపార్ట్మెంట్లు, హోటళ్లు, ఆఫీసులు నిర్మిస్తున్నారు. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ఈఫిల్ టవర్, లోఖండ్వాలా మినర్వాకు 3 రెట్లు, అంపైర్ స్టేట్ బిల్డింగ్కు రెట్టింపు ఎత్తు ఉండనుంది. గతంలో పనులు ఆగిపోగా మళ్లీ ప్రారంభమయ్యాయి.
News October 11, 2024
పాకిస్థాన్ సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్!
సొంత గడ్డపై వరుసగా మ్యాచులు ఓడిపోతుండటంతో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్ అలీమ్ దార్ను పీసీబీ చేర్చుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా నియమించినట్లు తెలుస్తోంది. అఖీబ్ జావెద్, అసద్ షఫీఖ్, అజహర్ అలీ, హసన్ చీమాలను తీసుకున్నట్లు టాక్. కాగా అలీమ్ దార్ ఇటీవల అంపైరింగ్కు వీడ్కోలు పలికారు.
News October 11, 2024
EPFOలో కీలక మార్పులకు సిద్ధమైన కేంద్రం?
ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మధ్య తరగతి వర్గాలకు మరింత లబ్ధి చేకూర్చేలా మార్పులు చేస్తున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఇందులో కనీస పెన్షన్ పరిమితి రూ.1000 నుంచి పెంచడం, పదవీ విరమణ సమయంలో పెన్షన్ ఫండ్ నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి, సులభంగా నగదు విత్ డ్రా, నెలవారీ ఆదాయం రూ.15వేల కంటే ఎక్కువగా ఉన్నవారికి పెన్షన్ పథకాన్ని విస్తరించడం వంటివి ఉన్నాయి.