News March 18, 2024
నంద్యాల: నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు

పదో తరగతి విద్యార్థులు సోమవారం నుంచి పరీక్షలు రాయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు 134 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ కేటగిరి సెంటర్లు 62 కాగా పోలీస్ స్టేషన్ దగ్గరగా, పోలీస్ స్టేషన్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీ సెంటర్లు 57, పోలీస్ స్టేషన్కు ఎనిమిది కిలోమీటర్లకు పైగా ఉన్న సెంటర్లో 15 ఉన్నాయి. ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News April 5, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤కోసిగి: పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.24,550లు స్వాధీనం➤ ఆదోని మార్కెట్లో పెరిగిన పత్తి ధర.!➤ జగ్జీవన్ రామ్ జీవితం అనుసరణీయం: జేసీ➤ విలువలతో కూడిన విద్యను అందించాలి: టీజీ వెంకటేశ్➤ సీఎం చంద్రబాబు నమ్మకద్రోహం చేశారు: హఫీజ్ ఖాన్➤ వర్ఫ్ బోర్డ్ బిల్లుకు రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా నిరసనలు➤ కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్➤ ఎమ్మిగనూరు: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
News April 5, 2025
కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్

కర్నూలు జిల్లా 10th విద్యార్థులకు శుభవార్త. పదో తరగతి పరీక్షలు కంప్లీట్ అయిన విద్యార్థులకు తాండ్రుపాడు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశానికి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. శిక్షణకు వచ్చే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తామన్నారు. వివరాలకు తాండ్రుపాడు కళాశాలను సంప్రదించాలన్నారు.
News April 5, 2025
కర్నూలు జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇవే.!

కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కోడుమూరులో అధికంగా 46.4 MM, సి.బెళగల్ 37.8, గోనెగండ్ల 24.2, కర్నూలు(A)23.6, చిప్పగిరి 22.8, కల్లూరు 21.0. కర్నూలు(R)19.8, కృష్ణగిరి 18.2, మంత్రాలయం 14.2, గూడూరు 13.0, హాలహర్వి 11.8, వెల్దుర్తి 11.4, ఎమ్మిగనూరు 10.4, ఆదోని 9.2, కోసిగి 8.8, పెద్దకడబూరు 7.4. నందవరం 7.2, దేవనకొండ 6.8, తుగ్గలి 3.4, ఆస్పరి 3.0, మద్దికెరలో 1.4MMగా పడింది.