News March 17, 2024

నంద్యాల: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద వంటి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుమిగూడి ఉండొద్దన్నారు. నంద్యాల జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరవకూడదని ఆదేశించారు.

Similar News

News October 27, 2025

‘మొంథా’ తుఫాను: ‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

image

‘మొంథా’ తుపాను నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. తుఫాను సంసిద్ధతపై సోమవారం అధికారులతో కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు అవసరమైనప్పుడు వివిధ శాఖలకు సంబంధించిన మానవ వనరులు (మెన్), సామగ్రి (మెటీరియల్) పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

News October 27, 2025

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: SP

image

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రత కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.

News October 26, 2025

వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

image

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.