News June 7, 2024
5 రోజుల్లో ₹579 కోట్లు సంపాదించిన నారా భువనేశ్వరి!

ఏపీలో చంద్రబాబు ఘన విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 55% పెరిగాయి. ఇవాళ కూడా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. జూన్ 3న (ఎన్నికల ఫలితాలకు ముందు రోజు) రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్.. ఇవాళ రూ.661కి చేరింది. తద్వారా ఆ కంపెనీ ప్రమోటర్ భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ.579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్లో భువనేశ్వరి 24.37 శాతం వాటాను కలిగి ఉన్నారు.
Similar News
News January 6, 2026
రాష్ట్రంలో 1095 పోస్టులకు నోటిఫికేషన్

AP: <
News January 6, 2026
ఏపీలో వేగంగా ఎయిర్పోర్టులు!

ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, పుట్టపర్తిలో డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటీవలే విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. రాజమండ్రిలో పనులు జరుగుతుండగా, భోగాపురంలో పూర్తి కావొచ్చింది. కొత్తగా కుప్పం, దొనకొండ (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు)లో ఎయిర్పోర్టులకు ప్లాన్ చేస్తున్నారు.
News January 6, 2026
ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు: భట్టి

TG: ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు సబ్సిడీ రూపంలో ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ద్వారా 29.23 లక్షల మంది లబ్ధి పొందుతుండగా రూ.13,499 కోట్లు ఖర్చవుతోందన్నారు. ‘గృహజ్యోతి’తో 52.82 లక్షల మందికి బెనెఫిట్ కలుగుతుండగా, రూ.2,086 కోట్లు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లు, చేనేతకూ సబ్సిడీ అందిస్తున్నామన్నారు.


