News October 19, 2024

నారా లోకేశ్ ఆగ్రహం

image

AP: విశాఖ పర్యటనలో భాగంగా నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంత్రి లోకేశ్ ఉ.9.45 గంటలకూ ఓపెన్ కాకపోవడంపై ఫైరయ్యారు. నిర్వహణ తీరుపై మండిపడ్డారు. గ్రంథాలయాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్‌ను అధ్యయనం చేసి APలో అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Similar News

News October 19, 2024

వాయిదాలతో విద్యార్థులకే నష్టం: రేవంత్

image

TG: పోటీ పరీక్షలను నిత్యం వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందని CM రేవంత్ చెప్పారు. ‘తరచూ వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టం. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని BRS పట్టించుకోలేదు. గతంలో ఆ పార్టీ నేతలు నిరుద్యోగులను ఎప్పుడైనా కలిశారా? పరీక్షల నిర్వహణను కోర్టులూ సమర్థించాయి. అభ్యర్థులు ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని CM కోరారు.

News October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థులపై కేసులు పెట్టొద్దు: CM

image

TG: ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని CM రేవంత్ పోలీసులను ఆదేశించారు. ‘కొందరు అభ్యర్థులు భావోద్వేగంలో ఉన్నారు. వాళ్లపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లపై కేసులు పెడితే పోటీ పరీక్షల్లో రాణించినా ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. వీళ్లు గ్రూప్-1 పరీక్షల్లో పాసైతే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు. అభ్యర్థులపై మానవత్వంతో వ్యవహరించండి’ అని పోలీసులకు సూచించారు.

News October 19, 2024

ప్రపంచ రికార్డు సృష్టించిన పసికూన

image

క్రికెట్ పసికూన జింబాబ్వే చరిత్ర సృష్టించింది. సీషెల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండానే 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. 35 బంతుల్లో 91 రన్స్‌తో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. మరో ఓపెనర్ మరుమణి 37 బంతుల్లో 86 రన్స్ చేశారు. ఛేజింగ్‌లో సీషెల్స్ 6.1 ఓవర్లలో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.