News May 11, 2024

మంగళగిరి ప్రజలకు నారా లోకేశ్ లేఖ

image

AP: మంగళగిరిని దేశంలోనే నం.1గా తీర్చిదిద్ది.. పేదరికం లేకుండా చేస్తానంటూ నారా లోకేశ్ ఆ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. ‘2019లో స్వల్ప తేడాతోనే ఓడినా.. ఆ తర్వాతి రోజు నుంచే ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యాను. ఐదేళ్లుగా ప్రజల కష్టసుఖాల్లో భాగమయ్యా. పాదయాత్రతో ఏడాది నియోజకవర్గానికి దూరంగా ఉన్నా నా మనసంతా మంగళగిరిలోనే ఉండేది. ఈ ఎన్నికల్లో మీ ఇంటిబిడ్డలా ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపండి’ అని కోరారు.

Similar News

News November 20, 2025

ఎదురుపడ్డా పలకరించుకోని జగన్-సునీత!

image

అక్రమ ఆస్తుల కేసులో AP మాజీ సీఎం జగన్ ఇవాళ HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులోనే ఉన్నారు. తన తండ్రి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ వాదనల నేపథ్యంలో ఆమె న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో అన్నాచెల్లెళ్లు ఎదురు పడినా ఒకరినొకరు పలకరించుకోలేదని, ఎవరో తెలియనట్లు వ్యవహరించినట్లు సమాచారం.

News November 20, 2025

ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రానికి స్థలం: CM

image

TG: ఈశాన్య రాష్ట్రాలతో సత్సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. HYDలో జరిగిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటించారు. TG సోదరుడు త్రిపుర గవర్నర్‌(ఇంద్రసేనా రెడ్డి)గా, త్రిపుర సోదరుడు TG గవర్నర్‌గా పనిచేస్తున్నారని CM అన్నారు.

News November 20, 2025

ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రానికి స్థలం: CM

image

TG: ఈశాన్య రాష్ట్రాలతో సత్సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. HYDలో జరిగిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటించారు. TG సోదరుడు త్రిపుర గవర్నర్‌(ఇంద్రసేనా రెడ్డి)గా, త్రిపుర సోదరుడు TG గవర్నర్‌గా పనిచేస్తున్నారని CM అన్నారు.