News September 12, 2025

సాగరంలో సాహస యాత్రకు సిద్ధమైన నారీశక్తి

image

భారత త్రివిధదళాలకు పదిమంది మహిళాఅధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టే సాహసయాత్రకు సిద్ధమైంది. దీనికి సముద్రప్రదక్షిణ అని పేరు పెట్టారు. ఇందులో భాగంగా ఏకధాటిగా 26,000 నాటికన్ మైళ్లు ప్రయాణించనున్నారు. అత్యంత కఠినమైన దక్షిణ మహాసముద్రం, డ్రేక్ పాసేజ్ జలాల్లో ఈ యాత్ర సాగనుంది. ఈ బృందం వచ్చే ఏడాది మేలో ముంబైకి చేరుతుందని అంచనా. దీనికోసం గత మూడేళ్లుగా ఈ బృందం కఠిన శిక్షణ పొందుతోంది.

Similar News

News March 20, 2026

అకాల వర్షాలు.. పంట నష్టంపై రైతుకు భరోసా!

image

AP: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీసత్యసాయి, NTR, అనంతపురం, మన్యం జిల్లాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు CM దృష్టికి తెచ్చారు. వాతావరణ పరిస్థితులపై రైతులను అప్రమత్తం చేయాలని CBN సూచించారు. మరోవైపు పంట నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్న భరోసా ఇచ్చారు.

News March 20, 2026

గల్ఫ్‌కు US ₹1.5 లక్షల కోట్ల ఆయుధాలు

image

UAE, కువైట్‌కు దాదాపు ₹1.5 లక్షల కోట్ల మిలిటరీ సేల్స్‌కు US ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మిస్సైల్, డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్‌, మిస్సైల్స్, F-16 యుద్ధ విమానం కోసం వివిధ రకాల ఆయుధాలను అమ్మనుంది. US, ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో ఇరాన్ ఈ 2 దేశాల్లోని అమెరికా బేస్‌లను టార్గెట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో కొన్ని ఆయిల్, గ్యాస్‌ ఫీల్డ్‌లూ లక్ష్యంగా మారుతున్నాయి.

News March 20, 2026

ధురంధర్-2: తొలి రోజే ₹100 కోట్లు!

image

భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజే ₹102 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిందని Sacnilk తెలిపింది. ప్రీమియర్స్‌తో కలుపుకొని ₹145 కోట్లు(₹172 Cr గ్రాస్) రాబట్టిందని వెల్లడించింది. 12,735 ప్రీమియర్ షోలు, తొలి రోజు 21,728 షోలు పడినట్లు చెప్పింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.