News March 17, 2024

నార్పల: పొలం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 

image

నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో శనివారం రాత్రి పొలం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బైక్‌కు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 2, 2026

అనంతపురం ఇక నుంచి 62 డివిజన్లు

image

50 డివిజన్లకు పరిమితమైన అనంతపురం నగరపాలక సంస్థకు మరో 12 డివిజన్లు అదనంగా పెంచారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62 డివిజన్లుగా మార్పు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలోని ఆశావాహులకు ఇదో చక్కటి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

News April 2, 2026

అమరావతి అజేయం.. లోక్‌సభలో బిల్లు ఆమోదం చరిత్రాత్మకం: ఎంపీ

image

AP రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని MP అంబికా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుల పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ఏపీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

News April 2, 2026

అమరావతి అజేయం.. లోక్‌సభలో బిల్లు ఆమోదం చరిత్రాత్మకం: ఎంపీ

image

AP రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని MP అంబికా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుల పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ఏపీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.