News November 16, 2024
ఆకాంక్షల రెక్కలపై అభివృద్ధి వైపునకు దేశం: మోదీ

భారత్ స్వతంత్ర ఉద్యమ కష్టాల నుంచి ఆకాంక్షల రెక్కలపై అభివృద్ధివైపు దూసుకెళ్తోందని PM మోదీ అన్నారు. ‘పదేళ్ల క్రితం వరకు ఈ జర్నీ ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అంతా నమ్ముతున్నారు. భారతీయ ప్రమాణాలను ప్రపంచం గుర్తిస్తోంది. బ్రిటిషర్లు వెళ్లాక, ఎమర్జెన్సీ టైమ్, సంస్థలు ప్రభుత్వాలకు దాసోహమైనప్పుడు ప్రజలే ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. పదేళ్లలో దేశ బడ్జెట్ రూ.16L Cr నుంచి రూ.48L Crకు పెరిగింది’ అని అన్నారు.
Similar News
News December 2, 2025
PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారు.
News December 2, 2025
PCOS ఉంటే వీటికి దూరంగా ఉండాలి

PCOS ఉన్నవారు బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి. వంటల్లో నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడం వల్ల PCOS, ఇన్సులిన్ స్థాయులు అదుపులోకి వస్తాయి. దీంతో గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
News December 2, 2025
ఇవాళ ఢిల్లీకి రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రంలో ఈ నెల 8, 9న జరిగే గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్రమంత్రులు, AICC నేతలను ఆయన ఇన్వైట్ చేయనున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మంలోని కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో CM పాల్గొంటారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.


