News December 12, 2024
4 పంచాయతీలకు నేషనల్ అవార్డులు

AP: రాష్ట్రంలోని 4 పంచాయతీలకు నేషనల్ అవార్డులొచ్చాయి. పలు కేటగిరీల్లో బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. ఆరోగ్యకర కేటగిరీలో చిత్తూరు(D) బొమ్మసముద్రం, పచ్చదనం-పరిశుభ్రత కేటగిరీలో అనకాపల్లి(D) తగరంపూడికి, సంతృప్తికర తాగునీరు కేటగిరీలో అనకాపల్లి(D) న్యాయంపూడికి, సామాజిక భద్రతలో ఎన్టీఆర్(D) ముప్పాళ్ల పంచాయతీలకు అవార్డులు వరించాయి.
Similar News
News October 30, 2025
నిర్మల్ పట్టణంలో ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం

నిర్మల్ పట్టణంలో గురువారం ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, నిర్మూలన మార్గాలకు సంబంధించిన విషయాలపై అవగాహన కలిగేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
News October 30, 2025
అజహరుద్దీన్కు మంత్రి పదవి.. మీరేమంటారు?

TG: అజహరుద్దీన్ మంత్రి కావడానికి టైం ఫిక్స్ అయింది. కాగా మంత్రివర్గ విస్తరణ సమయాల్లో గతంలో లేనంతగా కాంగ్రెస్ తాజా నిర్ణయం కాక రేపుతోంది. దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారని BJP.. ఓ సామాజికవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారిందని BRS ధ్వజమెత్తాయి. అయితే అజహరుద్దీన్ క్రికెట్లో దేశానికి పేరు తెచ్చారని, ఆయనకు పదవి రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై మీరేమంటారు.
News October 30, 2025
CBSE పరీక్షల తేదీలు విడుదల

వచ్చే ఏడాది జరిగే టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫైనల్ డేట్ షీట్ను CBSE విడుదల చేసింది. రెండు క్లాసులకూ ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు మొదలవుతాయి. టెన్త్ విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు, 12వ క్లాస్ స్టూడెంట్లకు ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. పరీక్షల షెడ్యూల్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ <


