News February 20, 2025
నేటి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు

TG: రంగారెడ్డి జిల్లా కన్హాశాంతివనంలో నేటి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. రాష్ట్ర పర్యావరణ మంత్రి కొండా సురేఖ సదస్సును ప్రారంభిస్తారు. 3రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు, న్యాయశాస్త్ర పట్టభద్రులు హాజరుకానున్నారు. సదస్సు ముగింపు రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Similar News
News November 20, 2025
న్యూస్ అప్డేట్స్

✦ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
✦ బీజేపీలో నాకు ఎవరితోనూ విభేదాలు లేవు: బండి సంజయ్
✦ దానం నాగేందర్, కడియంకి మరోసారి స్పీకర్ నోటీసులు.. అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
✦ టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. HYDలోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు
✦ అన్ని పార్టీల్లో అంతర్గత విభేదాలు సహజం: ఈటల
News November 20, 2025
NIT దుర్గాపుర్లో 118 నాన్ టీచింగ్ పోస్టులు

NIT దుర్గాపుర్ 18 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, BE, బీటెక్, MSc, MCA, PG, MBBS, MLSc, NET/SET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు గ్రూప్ A పోస్టులకు రూ.1500, గ్రూప్ B, C పోస్టులకు రూ.1000.
News November 20, 2025
పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(1/2)

ప్రస్తుతం రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో కోళ్లఫామ్ల గదుల్లో తేమ ఎక్కువగా ఉండి శిలీంద్రాలు పెరిగే ఛాన్సుంది. దీని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కోళ్లకు సోకి, అవి మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి. ఇదే సమయంలో గాలి ప్రసరణ షెడ్లోకి సరిగా ఉండేలా చూసుకోవాలి.


