News February 2, 2025
దేశ అప్పు రూ.181 లక్షల కోట్లు

దేశంపై అప్పుల భారం పదేళ్లలో ఏకంగా 192 శాతం పెరిగింది. 2015 మార్చి 31 నాటికి రూ.62 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రూ.181 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో విదేశీ రుణం 6.18 లక్షల కోట్లు, అంతర్గత అప్పు రూ.175 లక్షల కోట్లని తెలిపింది. 2026 మార్చి 31కి మొత్తం అప్పు రూ.196 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది.
Similar News
News November 19, 2025
ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.
News November 19, 2025
సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.
News November 19, 2025
త్వరలో పంచాయతీ ఎన్నికలు.. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్

TG: గ్రామ పంచాయతీల్లో ఓటరు సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. సెప్టెంబర్ 2న ప్రచురితమైన జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే రేపు(ఈ నెల 20) అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిపై DPO పరిశీలన చేస్తారని పేర్కొంది. ఈ నెల 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని వెల్లడించింది. త్వరలోనే GP ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.


