News October 23, 2024

రేపు ‘పుష్ప-2’ నేషనల్ ప్రెస్‌మీట్

image

రేపు మ.12 గంటలకు నేషనల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ‘పుష్ప-2’ మేకర్స్ ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ యూట్యూబ్ ఛానల్‌లో ఈ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపారు. ఇందులో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Similar News

News October 23, 2024

పుణేలో కోహ్లీ సగటు 133.50.. రేపు కూడా రిపీట్ చేస్తారా?

image

మహారాష్ట్రలోని పుణే MCA స్టేడియంలో కింగ్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 2 టెస్టుల్లో 3 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ 267 రన్స్ చేశారు. అత్యధిక స్కోర్ 254*గా ఉంది. యావరేజ్ 133.50 కావడం విశేషం. మరి రేపు NZతో ప్రారంభమయ్యే రెండో టెస్టులో కోహ్లీ ఎలా విజృంభిస్తారో చూడాలి.

News October 23, 2024

ఉద్యోగి కారుకు ప్రమాదం.. మేనేజర్ రిప్లై ఇదే..!

image

ఉద్యోగి కారు ప్రమాదానికి గురైంది. కారు ముందుభాగం దెబ్బతిన్న ఫొటోను అతడు తన మేనేజర్‌కి పంపించాడు. ఎవరైనా అయితే నువ్వు ఎలా ఉన్నావనే అడుగుతారు. కానీ ఆ మేనేజర్ మాత్రం ఏ టైమ్‌కి ఆఫీస్‌కి వస్తావో చెప్పు అంటూ రిప్లై ఇచ్చారు. ‘మీరు లేటుగా రావడాన్ని అర్థం చేసుకోగలను. కానీ మీ కుటుంబీకులు మరణిస్తే తప్ప ఆఫీసుకి రాకపోవడాన్ని ఏ సంస్థా సమర్థించదు’ అని జవాబిచ్చారు. ఈ చాట్‌ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది.

News October 23, 2024

24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి

image

AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.