News January 25, 2025
‘జాతీయ ఓటర్ల దినోత్సవం’.. మీరు ఎన్నిసార్లు ఓటేశారు?

భారతదేశ ఎన్నికల సంఘం(ECI) స్థాపనకు గుర్తుగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 1950 JAN 25న ECIను స్థాపించగా, 2011 నుంచి అదే రోజు వేడుక జరుగుతోంది. కొత్త ఓటర్లను ప్రోత్సహించడంతో పాటు ఓటుపై ప్రజల్లో అవగాహన కోసం ఏటా ఈ రోజు ECI అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే, JAN 1 వరకు 18ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసి 25న గుర్తింపు కార్డులు అందిస్తుంది. మీరు ఎన్నిసార్లు ఓటేశారో కామెంట్ చేయండి.
Similar News
News September 16, 2025
వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.
News September 16, 2025
OTTలోకి ‘వార్-2’ వచ్చేది అప్పుడేనా?

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఓటీటీ(నెట్ఫ్లిక్స్)లో రిలీజయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం 6-8 వారాల్లో సినిమాలు OTTలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.
News September 16, 2025
విగ్రహం వ్యవహారం.. భూమనపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన <<17725838>>కరుణాకర్<<>> రెడ్డిపై కేసు నమోదైంది. భూమన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ డిప్యూటీ ఈవో ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందని భూమన ఆరోపించారు. అయితే అది విష్ణు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని <<17730080>>ఏపీ ఫ్యాక్ట్చెక్<<>> స్పష్టం చేసిన విషయం తెలిసిందే.