News March 24, 2025

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు

image

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌‌ లా బోర్డు దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈనెల 26న బిహార్ రాజధాని పట్నాలో, 29న APలోని విజయవాడలో నిరసనలు జరపనున్నట్లు ప్రకటించింది. వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను కోరింది. ముస్లిం బోర్డు వినతిపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది.

Similar News

News January 23, 2026

రేపటి నుంచి 4 రోజులు బ్యాంకులు బంద్!

image

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రేపు 4వ శనివారం కాగా ఎల్లుండి ఆదివారం. 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు. ఇక వారానికి 5 రోజుల పనిదినాలు డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు మంగళవారం(27న) సమ్మెకు దిగనున్నాయి. దీంతో ఆరోజు కూడా తెరుచుకునే పరిస్థితి లేదు. ఫలితంగా వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే డిజిటల్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.

News January 23, 2026

₹11,399 కోట్లతో 6000 KM రోడ్ల అభివృద్ధి: కోమటిరెడ్డి

image

TG: IT, AI లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్లో ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని HYDలో జరిగిన ‘ఏస్ టెక్ హైదరాబాద్-2026’ సదస్సులో తెలిపారు. ₹11399 కోట్లతో 6000 KM రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. బెటర్ లైఫ్, మోర్ జాబ్స్, స్ట్రాంగ్ ఎకానమీకి ట్రాన్స్‌పోర్ట్ చాలా కీలకమన్నారు.

News January 23, 2026

Q3 ఫలితాల ఎఫెక్ట్.. 4 శాతం తగ్గిన ఇండిగో షేర్

image

దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు డిసెంబరు త్రైమాసికంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం ఏకంగా 78% పడిపోయి రూ.549.1 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,448.8 కోట్ల లాభం నమోదు కావడం గమనార్హం. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు, కొత్త కార్మిక చట్టాల అమలే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. Q3 ఫలితాల ప్రభావంతో ఇండిగో షేర్ మార్కెట్లో దాదాపు 4% పడిపోయింది.