News March 18, 2025
మే 20న దేశవ్యాప్త సమ్మె

లేబర్ కోడ్ రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రాన్ని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీస జీతం ₹26Kకు పెంచాలని, EPS కింద ₹9K పెన్షన్ ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నాయి. ఈ మేరకు మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ రెండు నెలలపాటు కార్మికుల సమస్యలపై అన్నిరాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నాయి.
Similar News
News March 19, 2025
క్రేన్ వక్కపొడి: 40KGల బంగారం, 100 KGల వెండి స్వాధీనం?

AP: గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ ఛైర్మన్ కాంతారావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి, రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భారీగా నల్లధనం చేరుతున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. లావాదేవీలపై స్పష్టత కోసం కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
News March 19, 2025
రోజూ వైట్ రైస్ తింటున్నారా?

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్రౌన్ రైస్(దంపుడు బియ్యం)లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. అధిక ఫైబర్ ఉన్న బ్రౌన్ రైస్ ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఇది బ్లడ్లో షుగర్ స్థాయులను స్థిరంగా ఉంచడమే కాకుండా మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని తెలిపారు. SHARE IT
News March 19, 2025
శ్రీవారి వివిధ సేవల టికెట్ల విడుదల తేదీలివే..

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఈ నెల 21న ఉ.10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదే రోజు మ.3గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటా టికెట్లు రిలీజ్ అవుతాయి. అలాగే, మార్చి 22న ఉ.10 గంటలకు జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్లు, అదే రోజు ఉ.11 గంటలకు మే నెల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను TTD విడుదల చేయనుంది.