News September 24, 2025
నవదుర్గలు – అలంకారాలు

బాలాత్రిపుర సుందరీ దేవి: లేత గులాబీ రంగు చీర, తుమ్మి పుష్పం
గాయత్రీ దేవి: నారింజ రంగు చీర, తామర పుష్పం
అన్నపూర్ణా దేవి: గంధం రంగు చీర, పొగడ పుష్పం
లలితా త్రిపుర సుందరీ దేవి: బంగారు రంగు చీర, ఎర్ర కలువ
మహాలక్ష్మీ దేవి: గులాబీ రంగు చీర, తెల్ల కలువ
సరస్వతీ దేవి: తెల్ల చీర, మారేడు దళాలు
దుర్గాదేవి: ఎర్ర చీర, మందారాలు
మహిషాసుర మర్దని: ఎరుపు నేత చీర, నల్ల కలువ
రాజరాజేశ్వరీ దేవి: ఆకుపచ్చ చీర, ఎర్ర పూలు
Similar News
News September 24, 2025
గాయత్రీ మాతగా వరంగల్ భద్రకాళీ దేవి

వరంగల్లోని భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి గాయత్రీ మాతగా కనిపించనున్నారు. ఈ రోజున చంద్రఘంటా రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంత్రం వేళల్లో సింహ, గజ వాహనాలపై ఊరేగింపు ఉంటుంది. నుదుటన చంద్రుడిని ధరించడంతో అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. ఈరూపంలో అమ్మను దర్శించుకుంటే శత్రునాశనం ఉంటుందని నమ్మకం.
News September 24, 2025
ఎస్సీ, ఎస్టీ కేసులపై హైకోర్టు కీలక తీర్పు

AP: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన FIRలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లేకుంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పిటిషన్కు విచారణ అర్హత ఉంటుందని తెలిపింది. ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ముందస్తు బెయిల్పై నిషేధం ఉంటుందని పేర్కొంది.
News September 24, 2025
శివపార్వతుల కథ: కాశీ అన్నపూర్ణావతారం

ఓసారి శివుడు అన్నంతో సహా అన్నీ మాయేనని అంటాడు. ఈ మాటలు నచ్చక పార్వతీ దేవి కాశీని విడిచి వెళ్లగా ప్రపంచంలో ఆహారం దొరకక ప్రజలు ఆకలితో అలమటిస్తారు. ప్రజల కష్టాలు చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలి తీరుస్తారు. అప్పుడు ఆహారం ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు భిక్షాపాత్ర పట్టుకుని పార్వతి వద్దకు వెళ్లి భిక్ష అడుగుతాడు. అప్పటి నుంచి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో కొలువై భక్తుల ఆకలిని తీరుస్తోంది.