News September 22, 2025

నవరాత్రులు: నేడు అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.

Similar News

News February 1, 2026

మిల్లర్లు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే వరి రకాలు

image

అత్యధిక దిగుబడి, అధిక బియ్యం నాణ్యత, చీడపీడలను తట్టుకునే కొన్ని వరి రకాలకు మిల్లర్లు, వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సన్నగింజ రకాలైన BPT 5204(సాంబ మషూరి), WGL-44(సిద్ధి), KNM-1638(కూనారం వరి-2) వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అలాగే అతి సన్న రకాలైన RNR 15048(తెలంగాణ సోన), జై శ్రీరామ్, HMT సోన.. దొడ్డు పొడవు గింజ రకాలైన MTU-1010, KNM 118లకు కూడా మంచి ఆదరణ ఉంది.

News February 1, 2026

కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుందంటే.. 1/2

image

కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రతి రూపాయిలో 39 పైసలు ప్రత్యక్ష పన్నుల(వ్యక్తులు-22 పైసలు, కార్పొరేట్ ట్యాక్స్-17 పైసలు) రూపంలో వస్తాయి. జీఎస్టీ-18 పైసలు, ఎక్సైజ్ డ్యూటీ-5 పైసలు, కస్టమ్స్ డ్యూటీ-4 పైసలు, రుణాలు, ఇతర అప్పుల ద్వారా-24 పైసలు, పన్నేతర ఆదాయం-9 పైసలు, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా-1 పైసా వస్తుంది.

News February 1, 2026

ప్రతి రూపాయి ఖర్చు ఇలా.. 2/2

image

కేంద్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ షేర్ రాష్ట్రాలకు అందుతుంది. ట్యాక్స్, డ్యూటీస్ వాటా కింద ప్రతి రూపాయిలో 22 పైసలు వెళ్తుంది. వడ్డీ చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర రంగ పథకాలకు 16 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు వెళ్తాయి. డిఫెన్స్ సెక్టార్‌కు 8 పైసలు, ఫైనాన్స్ కమిషన్‌కు 8 పైసలు, సబ్సిడీలకు 6 పైసలు, పెన్షన్లకు 4 పైసలు ఖర్చు చేస్తారు. 8 పైసలను పాలన, ప్రభుత్వ వ్యయాల వంటి వాటికి ఉపయోగిస్తారు.