News January 6, 2025
చిక్కుల్లో నయనతార.. ‘చంద్రముఖి’ నిర్మాతల నోటీసులు

తన డాక్యుమెంటరీ విషయంలో స్టార్ హీరోయిన్ <<14626837>>నయనతారకు<<>> మరో సమస్య ఎదురైంది. చంద్రముఖి సినిమాలో కొన్ని క్లిప్పింగ్స్ తమ అనుమతి లేకుండా వాడారంటూ నిర్మాతలు నెట్ఫ్లిక్స్, నయన్కు నోటీసులు ఇచ్చారు. రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఇదే డాక్యుమెంటరీపై హీరో ధనుష్ కూడా రూ.10 కోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే. తాజా నోటీసులపై ఆమె ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


