News February 26, 2026
NCERT పుస్తకంపై మోదీ అసంతృప్తి!

NCERT 8వ తరగతి పుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై PM మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జవాబుదారీతనం తీసుకురావాలని ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు NDTV తెలిపింది. ఇదంతా ఎవరు చూసుకుంటున్నారని, 8వ తరగతి పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఎందుకు బోధించాలని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పుస్తకాన్ని CJI <<19243239>>నిషేధించడం<<>> తెలిసిందే.
Similar News
News April 14, 2026
కరీంనగర్లో అంబేడ్కర్ జయంతి.. వాహనాల మళ్లింపు

KNRలో అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని CP గౌస్ ఆలం తెలిపారు. JGTL నుంచి వచ్చే భారీ వాహనాలను రేకుర్తి, SU, పద్మనగర్, రాంనగర్, తెలంగాణ చౌక్ మీదుగా మళ్లించనున్నామన్నారు. పెద్దపల్లి నుంచి వచ్చే భారీ వాహనాలు బొమ్మకల్ బైపాస్ నుంచి వెళ్లాలని, ప్రధాన కూడళ్లలో జనం రద్దీ దృష్ట్యా వాహనదారులు పోలీసులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు.
News April 14, 2026
3,058 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్

రైల్వేలో 3,058 NTPC(UG) ఉద్యోగాలకు పరీక్షల తేదీలను RRB విడుదల చేసింది. మే 7, 8, 9, జూన్ 13, 14, 16-21 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు 10 రోజుల ముందు అభ్యర్థులకు కేటాయించిన సిటీ పేరు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. రోజూ 3 షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది.
News April 14, 2026
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్.. లక్షణాలు ఇవే

కొందరు మహిళల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు తయారవుతుంటాయి. దీని వల్ల నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడిపడి తరచూ మూత్రవిసర్జన, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరగడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.


