News February 26, 2026
NCERT పుస్తకంపై మోదీ అసంతృప్తి!

NCERT 8వ తరగతి పుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై PM మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జవాబుదారీతనం తీసుకురావాలని ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు NDTV తెలిపింది. ఇదంతా ఎవరు చూసుకుంటున్నారని, 8వ తరగతి పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఎందుకు బోధించాలని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పుస్తకాన్ని CJI <<19243239>>నిషేధించడం<<>> తెలిసిందే.
Similar News
News February 26, 2026
పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వలేదు: CM రేవంత్

TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామన్నారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠిన చర్యలు చేపట్టామని గ్రూప్-1,2 ఆఫీసర్ల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారంతా ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
News February 26, 2026
మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయండి.. MLCల వినతి

AP: శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఎదుట విచారణకు హాజరైన MLCలు బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి కోరారు. ఈ సందర్భంగా రాజీనామాలకు గల కారణాలపై ఛైర్మన్ వారిని ప్రశ్నించారు. ‘రాజీనామా ఎందుకు చేశారు. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా?’ అని అడిగారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని వెంటనే అంగీకరించాలని జవాబిచ్చారు. వీరికి ఛైర్మన్ నోటీసులివ్వగా ఇవాళ హాజరై వివరణ ఇచ్చారు.
News February 26, 2026
తాళికట్టు శుభవేళ.. రష్మిక ఆనందబాష్పాలు

ఏ ఆడపిల్లకైనా వివాహమనేది జీవితంలో మధురమైన ఘట్టం. హీరోయిన్ రష్మిక మందన్న కూడా చిన్న కుటుంబం నుంచి నేషనల్ క్రష్ స్థాయికి చేరుకొని ఇప్పుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్నారు. జీవితాంతం తోడుంటానంటూ అగ్నిసాక్షిగా విజయ్ తన మెడలో తాళికట్టిన శుభవేళ రష్మిక కళ్లలో నీళ్లు తిరిగాయి. తన ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో వ్యక్తపరిచిన ఫొటో పైన చూడవచ్చు.


