News February 23, 2025

ఏప్రిల్ 29న NCET.. నోటిఫికేషన్ విడుదల

image

2025-26లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి NCET(నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తెలిపింది. APR 29న దేశవ్యాప్తంగా తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తామంది. ర్యాంక్ ఆధారంగా 64 IIT, NIT, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొంది.
వెబ్‌సైట్: <>https://exams.nta.ac.in/NCET/<<>>

Similar News

News February 23, 2025

ప్రజలంతా ఫిట్‌గా ఉండాలి: ప్రధాని మోదీ

image

దేశ ప్రజలంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్‌లో ఒబేసిటీ సమస్యను ప్రధాని ప్రస్తావించారు. నగరాల్లో పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ సమస్య పెరుగుతోందని చెప్పారు. దీని వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయని, పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలని పిలుపునిచ్చారు.

News February 23, 2025

దుమ్మురేపుతున్న ‘ఛావా’@రూ.300 కోట్లు

image

మరాఠా యోధుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ హిందీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 10రోజుల్లోనే ₹300Cr కలెక్షన్లను సాధించింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేసిన 8వ చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో పుష్ప-2 హిందీ వెర్షన్(5రోజులు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత జవాన్(6D), పఠాన్(7D), యానిమల్(7D), గదర్-2(8D), స్త్రీ-2(8D), బాహుబలి-2 హిందీ(10D) ఉన్నాయి. ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక కీలక పాత్రలు పోషించారు.

News February 23, 2025

భారత్‌తో మ్యాచ్.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. కంటి దురద కారణంగా ఆయన నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు. దీంతో ఇవాళ మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది. ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా ఆ జట్టు ఓపెనర్ ఫఖర్ జమాన్ టోర్నీ నుంచి వైదొలిగారు. బాబర్ ఆడకపోతే పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే.

error: Content is protected !!