News July 2, 2024

ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది: అఖిలేశ్ యాదవ్

image

ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదే. మతతత్వ రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయాయి. బీజేపీ 400 సీట్ల అజెండా ఫెయిలైంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈవీఎంల మీద మాకు ఇప్పటికీ నమ్మకం లేదు. వాటిని తొలగించే దాకా మా పోరాటం ఆగదు’ అని లోక్‌సభలో వ్యాఖ్యానించారు.

Similar News

News January 7, 2026

కంది గింజలను నిల్వచేసే సమయంలో జాగ్రత్తలు

image

కంది గింజలను గోనె సంచులలో లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, నేలపై లీటరు నీటికి మలాథియాన్ 50% ఇ.సి 20ML కలిపి పిచికారీ చేయాలి. కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేస్తే బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50mlను కిలో గింజలకు పట్టించి నిల్వచేసి పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు.

News January 7, 2026

రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

AP: రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించింది. ఆ రోజు 6PM నుంచి 12AM లోపు స్పెషల్ షో వేసుకోవచ్చని తెలిపింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 (GSTతో కలిపి) పెంచుకోవచ్చని పేర్కొంది.

News January 7, 2026

TG ప్రాజెక్టులకు చిల్లు పెట్టడం లేదు కదా: లోకేశ్

image

AP: TGని దాటి వచ్చే గోదావరి నీటినే రాష్ట్ర పరిధిలో తాము వినియోగిస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. నల్లమలసాగర్‌పై TG అభ్యంతరాల పట్ల స్పందిస్తూ ‘అక్కడి ప్రాజెక్టులకు మేం చిల్లు పెట్టడం లేదు కదా? ఆ ప్రాంతం దాటి వచ్చిన నీరు వృథాగా సముద్రంలోకి పోకుండా వాడుకుంటున్నాం. 1 TMC కోసం గతంలో వివాదాలు జరిగాయి. దేశాల మధ్య యుద్ధాలూ జరిగాయి. వేస్ట్‌గా పోయే నీరు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకూ ఇవ్వొచ్చు’ అన్నారు.