News June 4, 2024

NDA vs INDIA: క్రాష్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

image

ఎర్లీ ట్రెండ్స్ సరళిని గమనిస్తే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. పోటీ ఏకపక్షంగా లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 612 పాయింట్ల నష్టంతో 22,651, బీఎస్ఈ సెన్సెక్స్ 2117 పాయింట్లు పతనమై 74,313 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1440 పాయింట్లు ఎరుపెక్కి 49,539 వద్ద ఉన్నాయి. ప్రస్తుత పతనంతో మదుపర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.

Similar News

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News November 26, 2025

న్యూస్ అప్‌డేట్స్ @4PM

image

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ

News November 26, 2025

ప్రెగ్నెన్సీలో మాయ ఇలా ఉందా?

image

ప్రెగ్నెన్సీలో మాయ, శిశువు రక్తనాళాలు రక్షణ లేకుండా గర్భాశయ ముఖద్వారానికి దగ్గరగా ఉండటాన్నే వాసా ప్రీవియా అంటారు. దీనివల్ల డెలివరీ సమయంలో తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం ఏర్పడొచ్చు. ఈ పరిస్థితి ఉంటే నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. కొన్నిసార్లు సీ సెక్షన్ చేయాల్సి రావొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకొని దీన్ని ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.