News May 11, 2024

NDL: ప్రశాంత ఎన్నికల నిర్వహణ లక్ష్యం- కలెక్టర్, ఎస్పీ

image

జిల్లాలో మే 13న ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ కే.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News November 3, 2025

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

image

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు. అక్టోబర్ 25న లీప్ యాప్‌లో అటెండెన్స్ మార్కు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 3, 2025

గ్రామాల్లో నీటి సమస్య ఉండకూడదు: కలెక్టర్

image

గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్యలు ఉండకూడదని కలెక్టర్ డా.ఏ.సీరి ఆర్ డబ్ల్యుూఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఆమె పలు అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ శాఖ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

News November 3, 2025

భక్తులు అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

image

కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలు, నదీతీరాలకు తరలి వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మహిళలు దీపాలు వెలిగించి వాటిని నదుల్లో వదిలే సమయంలో, స్నానాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, చిన్న పిల్లలతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓర్వకల్ శ్రీ కాల్వబుగ్గ, రామేశ్వర, బ్రహ్మగుండేశ్వర, నందవరం దేవాలయంలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.