News September 16, 2024
చేతికి ఫ్రాక్చర్తో మ్యాచ్లో పాల్గొన్న నీరజ్

బ్రస్సెల్స్లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జావెలిన్ త్రో స్టార్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ను తాను విరిగిన చేతితో ఆడాడని X ద్వారా వెల్లడించారు. ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డానని, ఎక్స్ రేలో తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఎముక విరిగిందని తెలిపారు. డాక్టర్ల సహకారంతో ఫైనల్ ఆడగలిగాని తెలిపారు. ఆట పట్ల అతడికున్న నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Similar News
News September 5, 2025
అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి.. ఓటు వేయండి!

AP: అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ప్రభుత్వం 5 కి.మీ. పొడవైన ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనుంది. ఇప్పటికే 4 ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసింది. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. <
News September 5, 2025
RCB ఎఫెక్ట్.. చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే..

RCB విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంపై ఇంకా పోలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ లీగ్లో ఇది కూడా ఒక వేదిక. సేఫ్టీ దృష్ట్యా ఇక్కడ ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహించనున్నట్లు క్రిక్ఇన్ఫో పేర్కొంది. సెమీ ఫైనల్, ఫైనల్ కూడా అభిమానులు లేకుండానే నిర్వహిస్తారని తెలిపింది. జూన్ 4న RCB విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరిగి 11మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
News September 5, 2025
డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీఈడీ చేయొచ్చా?

విద్యార్థులు బీఈడీని దూరవిద్యా విధానంలో చదవడానికి ప్రత్యేక వర్సిటీలు లేవు. బీఈడీ లాంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోర్సును డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివితే సమస్యలు ఉంటాయి. టీచర్లుగా రాణించలేరు. కానీ NCTE నిబంధనల ప్రకారం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదివి, టీచర్లుగా పనిచేస్తున్నవారు మాత్రమే ఓపెన్ వర్సిటీ ద్వారా బీఈడీ చేసేందుకు అవకాశం ఉంది. దీనిద్వారా వారు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందడం వీలవుతుంది.