News August 6, 2024

నీరజ్ గోల్డ్ గెలవాలి.. నహ్తా వీసాలివ్వాలి!

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా గెలిచి బంగారు పతకాన్ని సాధించాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. అయితే, ఆయన గెలిస్తే ఎంతో మందికి ఉచితంగా ఒక్కరోజు వీసా లభించనుంది. నీరజ్ గోల్డ్ సాధిస్తే ఉచితంగా వీసా అందిస్తామని ‘అట్లిస్’ CEO మొహక్ నహ్తా హామీ ఇచ్చిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఫ్రీ వీసా కోసం ఆయన <>లింక్డిన్ పోస్టుకు<<>> మీ మెయిల్ ఐడీని కామెంట్ చేయండి.

Similar News

News February 5, 2026

33 గంటల ట్రాఫిక్ నరకం.. హెలికాప్టర్‌లో వెళ్లిపోయాడు!

image

గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఏకంగా 33 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఇందులో పారిశ్రామికవేత్త సుధీర్ మెహతా దాదాపు 8 గంటలు కారులోనే వేచి ఉండి విసిగిపోయారు. ఈక్రమంలో హెలికాప్టర్‌ను పిలిపించుకొని పుణేకు వెళ్లినట్లు ఆయన ట్వీట్ చేయగా వైరలవుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో వీలుండేలా ఎక్స్‌ప్రెస్ వేల వద్ద హెలిప్యాడ్స్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

News February 5, 2026

ఇలాంటివి చేయాలంటే భయపడాలి: చంద్రబాబు

image

AP: పామాయిల్, కెమికల్స్‌తో కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ నివేదిక ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘YCP హయాంలో చాలా అపచారాలు చేశారు. మళ్లీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కరుడుగట్టిన నేరస్థుడి తరహాలో నిన్న ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. దీనిని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. దీని పవిత్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

News February 5, 2026

వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

image

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.