News July 23, 2024
రెండు రోజుల్లో నీట్ తుది ఫలితాలు: కేంద్రమంత్రి

నీట్-యూజీ పేపర్ లీకేజీ కేసులో పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు <<13690901>>తీర్పును<<>> కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. సత్యమే గెలిచిందని, నీట్ తుది ఫలితాలను 2 రోజుల్లోగా వెల్లడిస్తామని మీడియాతో చెప్పారు. సుప్రీంకోర్టు <<13692290>>పరిశీలన<<>> ప్రకారమే నీట్ యూజీ మెరిట్ జాబితాను సవరిస్తామని చెప్పారు. పరీక్షల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వదిలిపెట్టమని హెచ్చరించారు.
Similar News
News November 19, 2025
BREAKING: ఖాతాల్లో రూ.7,000 జమ

AP: పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని మోదీ TNలోని కోయంబత్తూరులో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో దేశంలో అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమయ్యాయి. అటు కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను రిలీజ్ చేశారు. దీంతో రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో యాడ్ అయ్యాయి. మొత్తంగా రూ.7 వేల చొప్పున జమయ్యాయి.
News November 19, 2025
బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ పేరును BJP ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రేపు ఉ.11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు మరో 19మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 202 సీట్లు సాధించింది.
News November 19, 2025
ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు దాడులు చేయగలం: పాక్ నేత

ఇండియానే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మరోసారి రుజువైంది. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు టెర్రర్ గ్రూపులతో దాడులు చేస్తామని పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ హెచ్చరించారు. ఇప్పటికే తాము ఈ పని చేశామని, వారు బాడీలను లెక్కించలేకపోతున్నారంటూ విషం కక్కారు. బలూచిస్థాన్లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. ఎర్రకోట ఆత్మాహుతి దాడి, పహల్గామ్ అటాక్లనే అతను పరోక్షంగా ప్రస్తావించారు.


