News July 23, 2024
రెండు రోజుల్లో నీట్ తుది ఫలితాలు: కేంద్రమంత్రి

నీట్-యూజీ పేపర్ లీకేజీ కేసులో పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు <<13690901>>తీర్పును<<>> కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. సత్యమే గెలిచిందని, నీట్ తుది ఫలితాలను 2 రోజుల్లోగా వెల్లడిస్తామని మీడియాతో చెప్పారు. సుప్రీంకోర్టు <<13692290>>పరిశీలన<<>> ప్రకారమే నీట్ యూజీ మెరిట్ జాబితాను సవరిస్తామని చెప్పారు. పరీక్షల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వదిలిపెట్టమని హెచ్చరించారు.
Similar News
News November 26, 2025
రంగారెడ్డి జిల్లాలో త్వరలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో RR జిల్లాలో సర్పంచులు, వార్డ్ మెంబర్లు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పలేదు. నొటిఫికేషన్ రావడంతో త్వరలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


