News June 17, 2024
NEET పేపర్ లీక్ ఆరోపణలు.. సీబీఐ మాజీ జేడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

NEET పేపర్ లీక్ అయ్యిందంటూ ఆరోపణలు వస్తున్న వేళ జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటమ్ బాంబులు అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది. అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు’ అంటూ పలు ఉదాహరణలను ఓ యూనివర్సిటీలో రాశారని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన <<18403510>>జీవో 46ను<<>> సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఈసీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.
News November 28, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్పై రేప్ కేసు నమోదు

కేరళ పాలక్కాడ్ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్కూటత్తిల్పై అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనను రేప్ చేసి గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఓ యువతి CM విజయన్కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య ఆడియో రికార్డులు, చాటింగ్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని MLA చెప్పారు. కాగా రాహుల్ ప్రాథమిక సభ్యత్వాన్ని INC రద్దు చేసింది.
News November 28, 2025
తులసి ఆకులను నమలకూడదా?

తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తింపు పొందింది. అయితే ఈ మొక్క ఆకులను నమలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది పంటిపై ఉన్న ఎనామెల్ను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్ల రంగు మారవచ్చు. అయితే ఆకులను నమలకుండా మింగితే ఎన్నో రోగాలు నయమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో పోరాడి తులసి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.


