News June 22, 2024

NEET పేపర్ లీక్ వివాదం.. కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం

image

NTA పనితీరును సమీక్షించడానికి, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ISRO మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో ఢిల్లీ AIMS మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, HCU VC ప్రొ. బి.జె.రావు, IIT మద్రాస్ ప్రొ. రామమూర్తి, కర్మయోగి భారత్ కో ఫౌండర్ పంకజ్, IIT ఢిల్లీ డీన్ ప్రొ. ఆదిత్య, కేంద్ర విద్యాశాఖ JS గోవింద్ సభ్యులుగా ఉన్నారు.

Similar News

News October 9, 2024

నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు

image

తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్‌రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్‌లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.

News October 9, 2024

నేడు టీడీపీలో చేరనున్న మస్తాన్ రావు, మోపిదేవి

image

AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

News October 9, 2024

INDvsBAN: కొట్టేస్తారా? ఛాన్సిస్తారా?

image

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో 2వ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈనెల 6న జరిగిన తొలి T20లో భారత్ గెలిచింది. ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ వశం కానుంది. బంగ్లా గెలిస్తే సిరీస్ 1-1గా మారి 3వ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈనేపథ్యంలోనే నేటి మ్యాచ్‌లో గెలవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి భారత్ గెలిచి సిరీస్ వశం చేసుకుంటుందా? లేక బంగ్లాకు ఛాన్స్ ఇస్తుందా? వేచి చూడాలి. రా.7గంటలకు మ్యాచ్ ప్రారంభం.