News July 11, 2024
నీట్ పేపర్ లీకేజీ.. కీలక సూత్రధారి అరెస్ట్

నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజేశ్ రంజన్ అనే వ్యక్తిని CBI అధికారులు పట్నాలో అరెస్ట్ చేశారు. నిందితుడిని స్థానిక కోర్టు 10రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. అలాగే పట్నా, కోల్కతాలో సోదాలు చేసిన CBI.. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో పది మందికి పైగా అరెస్ట్ అయ్యారు. కాగా నీట్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జులై 18కి వాయిదా వేసింది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


