News July 11, 2024
నీట్ పేపర్ లీకేజీ.. కీలక సూత్రధారి అరెస్ట్

నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజేశ్ రంజన్ అనే వ్యక్తిని CBI అధికారులు పట్నాలో అరెస్ట్ చేశారు. నిందితుడిని స్థానిక కోర్టు 10రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. అలాగే పట్నా, కోల్కతాలో సోదాలు చేసిన CBI.. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో పది మందికి పైగా అరెస్ట్ అయ్యారు. కాగా నీట్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జులై 18కి వాయిదా వేసింది.
Similar News
News November 22, 2025
చిత్తూరు: ఉచితంగా స్కూటీలు.. మరో 3 రోజులే.!

జిల్లాలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీ కోసం ఆన్లైన్ దరఖాస్తులకు మరో 3రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థులు 25వ తేదీలోపు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అవసరమైన పత్రాలను APDASCELC.AP.GOV వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ఉమ్మడి చిత్తూరు నుంచి 124 అప్లికేషన్స్ నమోదైనట్లు తెలిపారు. నియోజకవర్గానికి 10 వాహనాలు ఇవ్వనున్నట్లు, లబ్ధిదారులు రూ.1 కూడా చెల్లాంచాల్సిన అవసరం లేదన్నారు.
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.


