News June 17, 2024

నీట్ పేపర్ లీక్ కాలేదు.. రెండుచోట్ల అవకతవకలు: కేంద్రమంత్రి

image

AP: నీట్ పేపర్ లీకేజీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు. రెండు పరీక్ష కేంద్రాల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుప్రీం ఆదేశాల మేరకు 1563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 26, 2026

నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

image

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.

News March 26, 2026

ALERT: టేస్ట్ కోసం చూస్తే.. ప్రాణాపాయమే!

image

ఫాస్ట్‌ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే మీరు డయాబెటిక్ వ్యాధిని కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే TG, AP, TN, కేరళం, కర్ణాటకలో ఫాస్ట్‌ఫుడ్ వినియోగం పెరిగిందని IJMR స్టడీ వెల్లడించింది. బయటి ఆహారంపై ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే షుగర్, ఊబకాయం బారిన పడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రూరల్ ఏరియాలో కంటే సిటీల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంది.

News March 26, 2026

కరెంట్ అఫైర్స్

image

* JNTUH బీటెక్ విద్యార్థి శివకుమార్ ఇందూరికి ‘జలశక్తి హ్యాకథాన్ 2025’ పురస్కారం.
* సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,07,879.
* నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం, IIT మద్రాస్ రోడ్లపై ‘పొగమంచును హరించే’ టైటానియం డయాక్సైడ్ పూతలను పరీక్షిస్తున్నాయి.
* పుణేలోని శాస్త్రవేత్తలు Neoloboptera peninsularis అనే కొత్త బొద్దింక జాతిని కనుగొన్నారు.